పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షి జ్జన్మంబు

  •  
  •  
  •  

1-291-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె.

టీకా:

అనినన్ = అని పలుకగా; విని = విన్నవాడై; భూదేవ = బ్రాహ్మణులలో {భూదేవులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; ఉత్తములు = ఉత్తములు; కున్ = కు; నరదేవ = రాజులలో {నరదేవుడు - నరులకు దేవుడు, రాజు}; ఉత్తముండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

బాలుడు జగన్మాన్యు డౌతాడు అనుచున్న విప్రోత్తములను ధర్మరాజు ఇలా అడిగాడు