పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణుడు భామల జూడబోవుట

  •  
  •  
  •  

1-262-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదనంతరంబ యష్టోత్తర శత షోడశసహస్ర సౌవర్ణసౌధకాంతం బయిన శుద్ధాంతభవనంబు సొచ్చి హరి తన మనంబున.

టీకా:

తదనంతరంబ = ఆ తరువాత; అష్టోత్తరశతషోడశసహస్ర = పదహారు వేలనూట ఎనిమిది, సహస్ర +షోడశ +శత +అష్ట *; సౌవర్ణ = బంగారు; సౌధ = మేడలలో; కాంతంబు = కాంతలున్నవి, భార్యలు ఉన్నవి; అయిన = అయినట్టి; శుద్ధాంత = అంతఃపుర; భవనంబు = భవనములు; చొచ్చి = ప్రవేశించి; హరి = కృష్ణుడు; తన = తనయొక్క; మనంబున = మనసులో.

భావము:

పిమ్మట గోవిందుడు పదహారువేల నూటయెనిమిది స్వర్ణ సౌధాలతో కూడిన అంతఃపుర ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఇలా అనుకొన్నాడు.