పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-196-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాశి నడుమ మునిగెఁడు
ము క్రియన్ భూరిభారర్శితయగు నీ
యిలఁ గావ నజుఁడు గోరినఁ
లిగితి వని కొంద ఱండ్రు, ణనాతీతా!

టీకా:

జలరాశి = సముద్రము; నడుమ = మధ్యన; మునిగెఁడు = మునిగిపోతున్న; కలము = ఓడ; క్రియన్ = వలె; భూరి = అత్యంత; భార = భారముతో; కర్శిత = పీడితము; అగు = అయినట్టి; ఈ = ఈ; ఇలన్ = భూమిని; కావన్ = కాపాడుటంకోసం; అజుఁడు = బ్రహ్మ {అజుడు - పుట్టుక లేని వాడు, భౌతిక జన్మము లేనివాడు, బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, భగవంతుడు}; కోరినన్ = కోరగా; కలిగితివి = అవతరించావు; అని = అని; కొందఱు = కొందరు; అండ్రు = అంటారు; గణనాతీతా = కృష్ణా {గణనాతీతుడు - ఎంచుటకు అతీతమైన వాడు, కృష్ణుడు.}.

భావము:

బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నట్టనడి సముద్రంలో మునిగిపోతున్న నావలాగ భరింపరాని బరువుతో క్రుంగిపోతున్న భూమండలాన్ని ఉద్ధరించటం కోసం, అంచనాలకి అందని అనంత! శ్రీకృష్ణా! నీవు అవతారం ఎత్తావంటారు మరికొందరు.