బాల ద్విపద భాగవతం : భాగం 7
601
నిలిచెఁ ద్రిలోకమాణిక్యంబు భాతి
జలజాక్షు కరుణ నిశ్చలముగా ధ్రువుఁడు
మైత్రేయునిచే ధ్రువచరిత్ర విన్న విదురుఁడు ప్రచేతసు లెవ్వరని ప్రశ్నించుట
తులలేక మెఱయు నీ ధ్రువచరిత్రంబు
తెలిసి యా నారదదేవర్షి మున్ను
రహిఁ[284]బ్రచేతసుల సత్రమునఁ గీర్తించె
సహజ వీణారవశ్రవ్యంబుఁగాఁగ
అనుఁడుఁ బ్రచేతసు లనువార లెవ్వ
రనివిదురుండుఁ దన్నడుగ నాలించి
తెలుపంగఁదొడఁగె మైత్రేయుఁ “డో విదుర!
అలఘుఁడు ధ్రువపుత్రుఁ డగు వత్సరునకు
మైత్రేయుఁడు విదురునికి వేనాదుల చరిత్రములను ముందుగా చెప్పుట
నొదవెఁ బుష్పార్ణుఁ డ య్యుర్వీశమణికి
విదితుఁడై వ్యుష్టాఖ్య విభుఁడుదయించె
సుతుఁడయ్యె సర్వతేజుండానృపతికి
అతని కార్యుఁడు చక్షువను మనువొదవె
నతనికి నుల్ముకుం డతనికి నంగుఁ
డతనికి నట వేనుఁ డనువాఁడుఁ గలిగె
దుర్మార్గుఁడైన వేనుని మార్చలేక తండ్రి అంగమహారాజు అర్ధరాత్రి అడవుల ప్రవేశించుట
వేనుని దుర్మార్గ వృత్తి వీక్షించి
నానావిధముల మాన్పఁగ లేక రోసి
{నగరి వీడిరహస్య మార్గాన పట్టి
తగనంగు డడవుల నడిరేయి పోగ
[284] రహి- ఆనందము, బాగు
611
మునులంత వేనుని మును రాజనంగ
యనయ[285] పాలకు నంగు గని మునీశ్వరులు}
కొంకక యాత్మీయ గురుతపోమహిమ
హుంకార మొనరించి యుర్విపై వ్రాల్ప
వేనుని మరణముతో దేశమరాచకము కాగా, తత్పాపపరిహారార్థము ఋషులు వేనుని యూరువును మధింపగా ఒక నిషాదుఁడు జన్మించుట
రాజ్యంబు నెల్లఁ జోరకులు[286] జారులునుఁ
బ్రాజ్యమదంబున[287] బాధించి రేది[288]
అదిచూచి మునులెల్ల నవ్వేను మేనఁ
గదిసి తారొక పుత్రుఁ గలిగింపఁ గోరి
యూరువుల్ దరువ[289] నం దొక నిషాదుండు[290]
ధీరుండు గిరిచరాధీశుండు వొడమె
వేనుమేనున నుండి వెడలెఁ బాపంబు
లానిషాదుని తోనె యనవశేషముగ
ఋషులు వేనుని బాహుద్వయమును మధింపఁగా లక్ష్మీ నారాయణులు జంటగా అర్చి, పృధువులను పేర నుద్భవించుట
అంతఁదద్బాహుద్వయంబు మధింప
గాంతమైథునయుద్గతంబయ్యె నపుడు
గురుతర మహిమానుగుణ లక్షణముల
హరియును, సిరియును నని వారిఁ దెలిసి
ప్రథితు లమ్మును లెల్ల భావించి వారిఁ
బృథుఁడు, నర్చియు నని పిలిచి రింపలర
ఋషులు పృథువుకు పట్టాభిషేకము చేయుట
అట్టియా మునులెల్ల నాపృథు నపుడ
పట్టంబుఁ గట్టిరి ప్రజలతోఁ గూడి
[286] చోరకులు- దొంగలు
[287] ప్రాజ్య మదంబున- అధికమైన గర్వంతో
[288] ఏదు- పెరుగు
[289] ఊరువులు తరువ- తొడలు మథింపగా
[290] నిషాదుడు- వేటగాడు, ఒకతెగ బోయ, పాపము యుండువాడు
621
డంబైన హేమపీఠముఁ దెచ్చె ధనదుఁ
డంబునాయకుఁ[291] డిచ్చె నాతపత్రంబు
చామరంబుల[292] నభస్వంతుఁ[293] డొసంగెఁ
బ్రేమనింద్రుండు కిరీట మర్పించె
హరిచక్రమును, వార్థి యమలశంఖంబు
సిరులు దైవార నిల్చిరి విశేషముగ
పృథు మహారాజు గోరూపయైన పృథివితో సంభాషించుట
ఆపృధుండంత ననన్యసామాన్యుఁ
డీపృథివీ తలం బెన్నఁ బాలించె
అట్టికాలమున ధాన్యము లెల్ల కడలఁ
బుట్టక ప్రజలార్తిఁ బొరలంగఁ జూచి
యిలమీఁద నలిగి యా పృథుఁడు చాపమున
బలిమి మించఁగ నొక్క బాణంబుఁ దొడుగ
వడఁకుచు ధేను భావము ధరియించి
పుడమి యెందేనియుం బోవంగఁ గాంచి
సరయుఁడై వెన్నాడి జనుచు నదల్చి
పరుష మార్గంబున భాసించె నిట్లు
“జనులెల్ల నలఁగ సస్యంబులం దొఱఁగి
పనిమాని యుండు నిష్ఫలమైన నిన్ను
యీగతి గోమూర్తి నెందేనిఁ జనిన
సాగనిత్తునె వృథాశ్రాంతియ[294] కాక
[291] అంబునాయకుడు- వరుణుడు
[292] చామరములు- వీవెనలు
[293] నభస్వంతుడు- వాయుదేవుడు
[294] శ్రాంతి- అలసట
631
కలుషించి నా మాట గైకొనవేని
తిలమాత్రములుగా వధించెద నిన్ను”
అనుటయుఁ బృధివి యిట్లనియె, “నో వైన్య
జననాథ! మున్ను దుర్జను లేచియుండ
నెఱయ నోషధుల నన్నింటిని మ్రింగ
నఱిగె నా కుక్షిలో నన్నియు నవియు
యిప్పుడు ననుఁబట్టి హింసించి తేని
యప్పుల[295] నిజ్జగం బంతయు మునుఁగు
యేరీతి నిల్చెద రీప్రజలెల్ల
నారసి కొ”మ్మన్న నాతఁ డిట్లనియె
“నీగౌరవం[296] బెంత? నిన్ను దండించి
యోగశక్తిన నిల్వ నొనరింతుఁ బ్రజల”
నావుఁడు విని ధాత్రి నవ్వి, “యో మనుజ
దేవ! నీవయ యాదిదేవుండ వరయ
వదలక నాకొక వత్సంబుఁ గూర్చి
పిదుకుము, పిదికింపు పెక్కు మార్గముల
ఇష్టార్థముల నెల్ల నిచ్చెద నిపుడ
శిష్టసన్నుత! దయసేసి పాలింపు
పృధు చక్రవర్తి మనువును లేఁగదూడగఁ జేసి గోరూప ధారిణియైన పృథివి నుండి ఓషధులను పిదికి భూమిని సస్యశ్యామలమొనర్చుట
అనిప్రసన్నత నిల్ప నావైన్యుఁ[297] డపుడ
మనువుఁ గ్రేపుగఁ[298] జేసె మహనీయ లీల
[295] అప్పుల- జలములు
[296] గౌరవము- బరువు, గొప్పదనము
[297] వైన్యుడు- వేనుని పుత్రుడైన పృథుచక్రవర్తి
[298] క్రేపు- దూడ
641
తనదు హస్తంబె పాత్రంబుగాఁ జేసె
వినుతౌషధుల నెల్ల వేగంబ పిదికి
ప్రజలకు నర్పించెఁ బ్రజలు నింపొంది
విజయాఢ్యు నవ్విభు వినుతించి రచట
గిరులును, మునులునుఁ గిన్నరాదులును
పరిచిత బహువత్స[299] పాత్ర కల్పనల
తమకభీష్టముఁగాగఁ దగిన పదార్థ
సమితులం బిదికి యాసక్తిఁ గైకొనిరి
పృథువు పరిపాలించుటచే ధాత్రికి పృథివి యనుపేరు వచ్చుట
మఱియు నా పృథుఁడు భీమగదాభిహతులఁ
దఱితోడ ధర సమస్థలిఁగా నొనర్చి
గ్రామ, పట్టణ, దుర్గ ఖర్వట, ఖేట
సీమలేర్పరచె విచిత్రముల్ గాఁగ
పృథుఁడిట్టిగతిఁ జక్కఁబెట్టిన కతనఁ
“బృథివి” యనంగ శోభిల్లె నిద్ధాత్రి
పృథు చక్రవర్తి కుమారుఁడు పృథుశ్రవసుఁడు తన తండ్రి యొనర్చు యజ్ఞాశ్వమును హరించిన యింద్రుని జయించి గుఱ్ఱమును తెచ్చి, ‘జితాశ్వుఁ’ డను పేరు పొందుట
అత్రియాజకుఁడుగా నావైన్య నృపతి
సత్రముల్ నూరు విస్మయముగాఁ జేసె
శతతమాధ్వరమున[300] సంక్రందనుఁండు[301]
వితతోరు పాషండవేషుఁడై వచ్చి
క్రతువాజిఁ[302] గొనిపోవఁగని యా నరేంద్ర
సుతుఁడు పృథుశ్రవసుండను నతఁడు
[299] వత్స- దూడ
[300] శతతమాధ్వరము- నూటయొకటవ యజ్ఞము
[301] సంక్రదనుఁడు- ఇంద్రుఁడు.
[302] క్రతువాజి- యజ్ఞాశ్వము
651
అమ్మహేంద్రుని గెల్చి యధ్వరాశ్వంబుఁ
గ్రమ్మఱందెచ్చెఁ బరాక్రమం బెసఁగ
అతని నందఱును “జితాశ్వుఁ” డటంచు
నుతిసేసి రిట్లు వైన్యుడు ధన్యుఁడగుచు
మైత్రేయుఁడు పృథు చరిత్రకు ఫలశ్రుతి చెప్పుట
ప్రజలఁ బ్రోచి శుభాత్మ పదవికి వేడ్క
విజయంబు సేసె నవ్వెలఁదితోఁ గూడి
యీపృథు చరితంబు నెవ్వరు వినిన
పాపంబు లణఁగు శుభంబు చేకూరు
విదితము గాగఁ జెప్పెఫలశ్రుతినిని
విదురునితోడను మైత్రేయుఁ డపుడు
మైత్రేయుడు ప్రాచీనబర్హి వృత్తాంతమును చెప్పుట
వైన్యుని తరువాత వసుధాతలంబు
సన్యాయగతి జితాశ్వప్రభుండేలె
నతఁడు నభస్పతి యను కాంతయందుఁ
బ్రతిలేని సుతు హవిర్థామనిం గనియె
ఆహవిర్ధానున కాత్మజుండయ్యె
బాహుబలాఢ్యుండు బర్హిషదుండు
అవని యంతయునుఁ బ్రాగగ్రకుశముల[303]
సవములం[304] గలయ నాచ్ఛాదించు కతన
ప్రాజ్ఞులు ప్రాచీనబర్హి[305] యనంగఁ
బ్రజ్ఞాతుఁడయ్యె నా బర్హిషదుండు
[303] ప్రాగగ్రకుశములు- తూర్పు దిశవైపుగా చివళ్ళు గల దర్భలు
[304] సవము- యజ్ఞము
[305] ప్రాచీనబర్హి- ఇంద్రుడు, బర్హిషదుడను రాజు, బర్హి- దర్భ, బర్హి- నెమలి పింఛము
661
అతఁడు శతద్రుతి యను పత్ని యందు
సుతులఁగాంచెఁ బ్రచేతసులు నాఁగఁ బదుర
తుల్య[306]నామంబులఁ తుల్యవ్రతముల
తుల్యాకృతులను బొల్తురు వారు చాల
జనకాజ్ఞచేఁ బ్రజాసర్గంబు[307] కోర్కిఁ
దనరంగ నా ప్రచేతసులు పదుండ్రుఁ
దోయధి[308] నడుమ దాంతులు మెచ్చఁ దపము
సేయుటకై కూడి శీఘ్రంబ సనుచు
తెఱవున నొకచోట దివ్యకాసార
వరజలోద్ధితుడైన[309] వామదేవుండు
హరికీర్తనార్చన ధ్యానక్రమముల
వరుసతోఁ దెలుప భావంబుల మెచ్చి
జలనిధిలో నొక్క సన్నపుదీవి
నలయక తపముసేయఁదొణంగి రంత
నారద, ప్రాచీన బర్హి సంవాదము
పనివడ[310] ప్రాచీనబర్హిఁ జేరంగఁ
జనుదెంచి నారద సంయమీంద్రుండు
“వినుము, బర్హిషదుండ! విడువక యిటుల
ననయంబు నీవు కర్మాసక్తి నొంద
యేమిఫలంబు వహించితి” వనుఁడు
నామహీపాలుఁడా యతికి నిట్లనియె
[306] తుల్య- సమానము, ఒకటేయైన
[307] ప్రజాసర్గము- పిల్లలుపుట్టించుట
[308] తోయధి- సముద్రము
[309] వర జల ఉద్ధితుడు- శుభ్రమైన జలములనుండి ఉత్పన్నమైన / లేచిన వాడు
[310] పనివడు- పనిపడు, పూనికొను
671
“తాపసవర్య! యే తగులును నెఱుఁగ
నోపికఁ గర్మంబు నొనరింతు నెపుడు
జ్ఞానమార్గముఁ దెల్పి జడు నన్నుఁ బ్రోవు
మానితగతి” నన మౌని యిట్లనియె
“హరిభజించుట మాని యనిశంబుఁ గర్మ
పరత నుండుట నీతి పదమె? రాజేంద్ర!
మఖముల నీ చేత మడిసిన పశువు
లఖిల మార్గముల నిన్నటులనే మఱల
బదిలంబుగాఁ బట్టి బాధింతు మనుచు
నెదురు చూడ దొణంగె నిదె చుట్టు వార
కలదిట్టి పనికి నొక్కటి యుపాఖ్యాన
మలవడఁ తెలిపెద నాలింపు మలర
నారదుఁడు ప్రాచీనబర్హికి పురంజనోపాఖ్యానము చెప్పుట
రాజొక్కరుండు పురంజనుఁ డనఁగ
రాజిల్లు నెంతయుఁ బ్రఖ్యాతుఁ డగుచు
నతఁడు పురాన్వేషి యైధాత్రిఁ దిరిగి
శితికంఠుశైల[311] దక్షిణ సానువందు
యందమై తూర్పున నైదు[312] పశ్చిమము
నందిరు[313], బార్శ్వములన రెండు రెండు[314]
నైనవాకిళ్ళఁ బెంపారు పురంబు[315]
సానురాగతఁ జేరి యందు చిత్రముగ
[311] శితికంఠు శైలము- శివునికొండ, కైలాసము
[312] తూర్పుననైదు- 2 కళ్ళు 2 ముక్కురంధ్రాలు 1 నోరు
[313] పశ్చిమంబు నందు ఇరు- మూత్రావయవ, మలావయవ రంధ్రములు
[314] బార్శములనరెండు రెండు- రెండు ప్రక్కల రెండు చెవిరంధ్రములు
[315] పురము- జీవుడు వసించు దేహము
681
పంచాననోరగ[316] ప్రతిహార సహితఁ
బంచక ద్వయ సఖిఁ[317] బ్రమదోత్త[318] మాఖ్యఁ
గనుఁగొని దానితోఁ గలసి యవ్వీట
ననుపమ భోగంబు నందుచు నుండె
నాతండు మఱియుఁ బంచాశ్వ[319] యుక్తంబు
నాతత చక్ర ద్వయాభిశోభితము[320]
వచనీయ కూబర[321] ద్వయము సువర్ణ[322]
రచనాంచితముఁ బంచ రజ్జు[323] బద్ధంబుఁ
జతుర సారథిక[324] మక్షయ తూణ[325] యుతము
వితతాధిపత్యుప దేశ స్థలంబు
ఉదర భీమమునైన యురురథం బెక్కి
పదనొకండ్రగు చమూపతులు[326] సేవింప
నాతుక మఱి వేఁటలాడును మఱియు
ఘాతుకుం డగుచు మఖంబు లొనర్చు
ప్రమదోత్తమాకేళి పరవశుండగుచు
నమిత సంతతిఁగాంచి యాపురంజనుఁడుఁ
బెరయుచు నుండంగఁ బెద్ద గాలంబు
జరిగె నప్పుడు నోర్వఁజాల కప్పురిని
కాలనామకుఁడైన గంధర్వు భటులు[327]
చాలఁబోరుదురు నిస్సత్వంబుఁగాఁగ
[316] పంచానన ఉరగము- పంచవాయువులతో ఊపిరి
[317] పంచకద్వయసఖులు- దశేంద్రియములు
[318] ప్రమదోత్తమ- మనసు
[319] పంచాశ్వములు- ఇంద్రయ విషయపంచకము
[320] చక్రద్వయము- పాపపుణ్యాలు
[321] కూబరద్వయము- రెండునొగళ్ళు, శోకమోహములు
[322] సువర్ణము- బంగారము, రజోగుణము, అహంకారం
[323] పంచరజ్జువులు- పంచప్రాణాలు
[324] చతుర సారధికము- చతురంతఃకరణములు
[325] అక్షయతూణ- అక్షయ అమ్ములపొది, అనంత వాసనారూప అహంకార ఉపాధులు
[326] పదనొకండ్రగు చమూపతులు- 11గురు సేనాపతులు ఏకాదశ ఇంద్రియములు
[327] గంధర్వులు- దివసములు
691
కలయ నబ్భటులతోఁ గడు పోరి పోరి
యలసెఁ బ్రతీహారుఁ డైనట్టి ఫణియు
అంతభయాహ్వయ యవనాగ్రజుండు
హంతయప్పురి సొచ్చి యవిషహ్యగతుల[328]
బాధయొనర్పంగ భయనామకుఁడును
సాధించి యా పురంజనుఁ గాసిఁ బెట్టె
సఖుఁడైన యా యవిజ్ఞాతుని[329] మఱచి
సుఖియైన యా పురేశుఁడు చాల నలఁగి
ప్రమదోత్తమా సతిఁ బాయంగ లేక
భ్రమసె యారవము ఘోరంబుగా నొదవ
వెడలె నప్పురి నుండి వెడలిన యపుడ
తొడిఁబడ బడలించె దురితంబు లెల్ల
క్రతుహత పశువు లుత్కట రోష వృత్తి
నతివేల మర్మప్రహారముల్[330] సేసె
తుదలేని బహువిధార్తులఁ గొంతఁగాల
మదవద పడినొచ్చి యాపురంజనుఁడు
సఖులతోఁ బాసి యా సఖి యెఱింగింప
సఖునవిజ్ఞాతునిం జక్కఁగాఁ దెలిసి
వనట యంతయు మాని వాసికి నెక్కి
కనియె నచ్యుతపదాకలనసౌఖ్యంబు[331]
[328] అవిషహ్యగతులన్- న + వి + సహ్యగతులు- మిక్కిలి సహించుటకు వీలు లేకుండ
[329] అవిజ్ఞాతుడు- తాను జీవాత్మ సఖుడు పరమాత్మ, ఇద్దరికిని అబేధము కనుక సఖులు
[330] అతివేల మర్మప్రహరములు- అనోక వేలకొద్దీ ఆయువు పట్టు నొప్పించు దెబ్బలు
[331] అచ్యు పద ఆకలన సౌఖ్యము- చ్యుతము లేని, క్షతిలేని విష్ణుపదభక్తి అవగాహనముచే కలిగిన సౌఖ్యము