బాల ద్విపద భాగవతం : భాగం 5
401
యాయేటి దఱిని, శమ్యాప్రాస మనఁగ
నాయతంబై[92] యొప్పు నాశ్రమసీమ
నిలిచి భాగవతంబు నిర్మించె జగతిఁ
గలపురాణములలోఁ గడుమించి వెలయ
ద్వాపరయుగ నిర్మితంబయి మెఱయు
నాపురాణము వ్యాసుఁ డంతంబుఁ గాఁగఁ
జొప్పడం జదివించె శుకయోగిచేతఁ
జెప్పెనాతఁడు బరీక్షిన్నృపాలునకు
యిదిపరాశరపుత్రుఁ డిప్పురాణంబు
నదనునం జెప్పిన యట్టిక్రమంబు
వినుమింక నిక్కథ వినిన యారాజు
జననంబు చెప్పెద సరసంబుఁ గాఁగ
అశ్వత్థామ పరాభవము
అనిలజు[93] చే నొచ్చి యాసుయోధనుఁడు[94]
పనువుచు రణసీమఁ బడియున్న వేళ
నతనికిం బ్రియము సేయఁగఁ గోరి ద్రోణ
సుతుఁ[95]డర్థరాత్రంబు చోద్యంబు గాఁగ
పరశురామక్రియాపరిపాటిఁ దోప
సిరిమించి పాండవశిబిరంబుఁ జొచ్చి
ద్రౌపదికొడుకుల[96]తలలు ఖండించి
యోపక తన పతి కొప్పించి చనియె
[92] ఆయతము- విస్తారము
[93] అనిలుజుడు- వాయుపుత్రుడైన భీముడు
[94] సుయోధనుడు- దుర్యోధనుడు
[95] ద్రోణసుతుడు- అశ్వత్థామ
[96] ద్రౌపదికొడుకులు- ఉపపాండవులు (పాండవులకు ద్రౌపది యందు పుట్టినవారు)
411
ద్రౌపది యిటు ప్రభాతంబున వచ్చి
యాపుత్రులటుల ద్రౌణ్యాహతులగుట[97]
కాంచినెవ్వగ నుండఁ గని ధనంజయుఁడు
పాంచాలి యడలెల్ల[98] బాపెద ననుచు
హరిసారథిగ శతాంగారూఢుఁ[99] డగుచు
నరిగె నా ద్రౌణి పదానుసారమున
ద్రోణపుత్రుండు పార్థుని తేరుఁ గాంచి
ప్రాణభయంబునఁ బరువిడి యలసి
తిరుగఁ ద్రిప్పెడునట్టి తెఱఁగెఱుంగకయ[100]
నరుదుగా బ్రహ్మ శిరాస్త్రంబు వైచె
ఆయస్త్ర మపుడు కాలానలాభీల
మైయంబరంబున నరుదేరఁ జూచి
శౌరి[101]యానతిఁ జేసి సవ్యసాచియును
భోరన బ్రహ్మాస్త్రమునుఁ బ్రయోగించె
అవియు రెండునుఁ బోరె నాత్మతేజముల
దివినున్న దివిజపంక్తికి[102] భీతిఁ గఱప
త్రిభువనావాసు లర్థింపఁ బార్థుండె
యుభయాస్త్రముల లీలనుపసంహరించె
అనువొప్ప నడచి ద్రోణాత్మజుం బట్టి
కొనుటయు, కంసాంతకుఁడు పోలజూచి[103]
[97] ద్రౌణ్యాహతులు- ద్రౌణ్యు(అశ్వత్థామ)చేతిలో హతులు (మరణించినవారు)
[98] అడలు- శోకము
[99] శతాంగము- యుద్ధమున కుపయుక్తమగు రథము, సంగర రథము
[100] తిరుగఁ ద్రిప్పెడునట్టి తెఱఁగెఱుంగకయ- ఉపసంహారము తెలియకుండా
[101] శౌరి- శూరుని మనుమడు, శ్రీకృష్ణుడు
[102] దివిజపంక్తి- దేవతల సమూహము
[103] పోలజూచి- వంక చూసి
421
యితఁడు ఘాతకుఁ[104] డితం డెక్కడి విప్రుఁ
డితనిఁ ద్రుంచుట యుక్త మిప్పుడ యనుచు
బోధింపినను గురుపుత్రుం డటంచుఁ
గ్రోధంబు పార్థుండు కొంత లోఁగొనుచు[105]
ప్రేయసి కితనిఁ జూపెదఁగాక యనుచు
నాయత పాశబద్ధాత్ముని నతని
తేరిపై నిడికొనితెచ్చి పాంచాలి
చేరువ నిడిన నచ్చెలున యా ద్విజుని
ననపరాథులఁ దనయాత్మ సంభవులఁ
దునుముటకై పెక్కుఁ ద్రోవలం దూఱి
పతులమోములు చూచి పలికె ధైర్యమున
“నితనిఁ ద్రుంపఁగ మనకేమి ఫలంబు
యెట్టివాఁడైనఁ గానిండు మీ గురుని
పట్టియీతండు నొంపఁగ[106] బాడిఁ గాదు,
కృపిని, ద్రోణునిఁ జూచి కృపసేయఁదగుట[107]
నపరాథ మొనరించెనని యెన్నఁ దగునె?”
యనునంత మురవైరి యర్జునుఁ జూచి
“యనఘాత్మ! నినుఁగాంచి యపుడితం డచట
పరులిడె భువి నిట్టి పంద యవధ్యుఁ[108]
డరి[109]యయ్యు వీడందగ”వనుచు[110], నంత
[104] ఘాతకుడు- హంతకుడు
[105] లోగొను- స్వాధీనముచేసికొను
[106] నొంపు- సంహరించు
[107] అగుట- అయి ఉండగా
[108] పంద అవధ్యుడు- పిరికిపంద చంపదగినవాడు కాదు
[109] అరిన్- శత్రువును
[110] వీడందగవు- విడిచిపెట్టుట న్యాయము
431
అతని హింసింప నుద్యుతుఁడైన[111] వాయు
సుతుని వారించె మెచ్చుగ నీతిఁ దెలిపి
క్రీడియు నా దేవకీపుత్రు నాజ్ఞ
బాడబు[112] ముం దల బలిమిమైఁ గోసి
మచ్చరంబున శిరోమణియు వేగమున
బుచ్చుక దయసేసె, పోవంగ విడిచె,
శ్రీకృష్ణుడు సుదర్శనంబుచే ఉత్తరాగర్భ సంరక్షణంబు సేయుట
ఇవ్విధంబునఁ గృష్ణుఁ డెల్లవైరులను
కవ్వడి[113] హేతువుగాఁబరిమార్చి
కృతబంధుతా జలక్రియుఁడైన ధర్మ
సుతుని నూరార్చి యాశుభమతి చేత
అశ్వమేధములు మూఁ డమరఁ జేయించి
శాశ్వత కీర్తు లాశల[114]నెల్ల నించి
తనపురికేగు యత్నము సేయునంతఁ
గనియభిమన్యునిఁగాంత[115] యేతెంచి
“యదునాథ! యిపుఁ డొక్క యస్త్రతేజంబు
కదుముక[116] బలిమి నాగర్భంబుఁ బొదివి
ఉడుగక తాపంబు నొనరింపఁ దొణఁగె
కడుపు చల్లఁగఁ జేసి కావు మో దేవ!”
అనివిన్నవించిన నది మున్ను ద్రౌణి
అనఘుం డపాండవం[117] బని వైచినట్టి
[111] ఉద్యుతుడు- సిద్ధమైనవాడు
[112] బాడబుడు- బ్రాహ్మణుడు (రూపాంతరం)
[113] కవ్వడి- చేతుల కవ (రెండింటి) తోనూ వడిగా బాణములు వేయువాడు
[114] ఆశలు- దిక్కులు
[115] అభిమన్యునికాంత- ఉత్తర, పరీక్షిత్తు తల్లి
[116] కదుము- ఆక్రమించు
[117] అపాండవంబు- పాండవులు లేకపోవుగాక
441
బ్రహ్మశిరోనామ పటుతరాస్త్రముగ
బ్రహ్మణ్యదైవంబు[118] భావించె నంత
అభిముఖంబుగ వచ్చు నైదు[119] శస్త్రముల
సభయులై కని పాండుజగతీశసుతులు
తమతమ కైదువల్[120] ధరియించి రపుడ
తమకంబు తోడ నింతయుఁ గాంచి శౌరి
ఆయమ గర్భంబు, నప్పాండుసుతులఁ
బాయక ప్రోచుట పనిగాఁగ నపుడు
సరిలేని తన సుదర్శనము నసంఖ్య
పరకర్శనంబు నేర్పడ నియోగించె
నాయోగయోగీశుఁ[121] డనువుగాఁ దనదు
మాయచేఁ బొదివె నమ్మగువ గర్భంబు
పైకొన[122] లేదయ్యె బ్రహ్మశిరంబు
నాకంజలోచనునస్త్రంబు[123] మీద
హరియు ధర్మజునిచే ననునీతుఁ[124] డగుచుఁ
గరిపురంబున మోదకలితుఁడై యుండె
శరతల్పగతుఁడైన భీష్ముని ధర్మజుఁడు సేవించుట
నాయుధిష్ఠరుఁ డంత నాత్మీయ జనుల
రోయక[125] యనిలోనఁ ద్రుంచిన పనికి
మదిలోన శోకంబు మల్లడిఁగొనఁగ[126]
నొదవిన తాపంబు నోరువలేక
[118] బ్రహ్మణ్యదైవము- శ్రీకృష్ణుడు
[119] ఐదు- వెంటబడివచ్చు
[120] కైదువు, కైదువ- ఆయుధమలు
[121] యోగయోగీశుడు- శ్రీకృష్ణుడు
[122] పైకొను- కవియు, మీఱు
[123] కంజలోచనునస్త్రము- విష్ణుచక్రము
[124] అనునీతుడు- బుజ్జంగింపబడినవాడు
[125] రోయక- రోతపడక, అసహపడక
[126] మల్లడిగొను- పరితపించు, పెనగొను
451
వ్యాస, కృష్ణులును ధౌమ్యాదులు బోధ
సేసినం దెలియక చిత్తంబుచెదరి
తడవుగా నరశరతల్పంబు నందు
పడియున్న భీష్ముని భజియింపఁగోరి
అనుజులుఁ గొలువఁ గంసాంతకుం గూడి
చనుదెంచె నచటికి సమ్మదం బలర
నలువొప్ప నపుడు పాండవులు శౌరియునుఁ
దెలుపుచు మ్రొక్కిరా దేవవ్రతునకు
తెఱఁగొప్ప బ్రహ్మర్షి దేవర్షి వరులు
వఱలు రాజర్షులు వచ్చిరచ్చటికి
హృదయాంబుజము నందు నెసఁగు శ్రీకృష్ణుఁ
జెదరని భక్తిఁ బూజితునిఁగాఁ జేసి
గౌతమ నారద కౌశీక వ్యాస
శాతాత[127] పాత్రి కశ్యప వసిష్ఠాది
మునులకు నాతిథ్యములు నొసంగించి
మనుమలం గూర్చిన మతి నాదరించి
యాసీనులగు వారినందరం జూచి
యాసత్యసంధుఁ డుదాత్త మార్గమున
తొలుత సుయోధనాదుల దుర్నయంబుఁ
దలఁకని పాండవధర్మవర్తనము
[127] శాతాతపుడు- స్మృతి గ్రంథం రచించిన ఒక ముని.
461
ఆకుంతి తనయుల కనిశఁబుఁ గలుగు
శ్రీకృష్ణు కరుణా విశేష సంగతియు
మొదలికించియు ధర్మమునకే జయంబు
పదిల మెచ్చట నని భాషించి యపుడు
తనుఁభక్తి నడిగెడు ధర్మపుత్రునకు
ననువుగా వర్ణాశ్రమాచార విధులు,
దానము, క్షత్రియధర్మమార్గములు,
మానినీ వైష్ణవమత ధర్మములును,
క్రమమున ధర్మార్థకామమోక్షముల
సమయంబులును, విశేషంబుగాఁ దెలిపి
అరుణ దేవుం డుత్తరాయణంబునకు
నరుదెంచు టెఱఁగి దేహమువీడఁదలఁచి
తనయగ్రమున నున్న దైత్యారి వదన
వనజంబుపై దృష్టి వలనొప్ప నిలిపి
భావించి యానంద పరిపూర్ణుఁ డగుచు
నావాసుదేవు నిట్లని వినుతించె
భీష్ముఁడు శ్రీ కృష్ణుని స్తుతించుట
“త్రిభువనమోహన దివ్యమూర్తియును
శుభమందహాస భాసుర ముఖాబ్జంబు
చలదలకములు వీక్షణ విలాసంబు
జలదవర్ణంబు భూషణముల మెఱుఁగు
471
నెలమి నొప్పారెడి యీకృష్ణునందు
నిలుచుఁ గావుత నాదు నెమ్మనం బెపుడు
బలయుగళం బెదుర్పడు వేళ నడుమ
బలభేదిసుతునకు[128] భక్తిఁ దత్త్వంబు
తెలిపిన యయ్యాదిదేవుని యందు
నలువొందుఁ గావుత నాబుద్ధి యెపుడు
నాసమీపంబు విన్నాణంబు చేత
గాసిల్లు పార్థునిం గావంగఁ బూని
ప్రతిన వర్జించి చక్రము చేతఁ బట్టి
అతిరోషమున నాకు నభిముఖుం డగుచు
నడచిన యట్టి యీనలినాక్షు నందు
విడువని మతి నాకు విలసిల్లుఁ గాత
వెల్లావిరిగఁ[129] బెక్కు విభ్రమగతుల
గొల్లభామల వెఱ్ఱిఁ గొలిపిన యట్టి
చెలువుండి శౌరి మచ్చిక నెల్ల యపుడు
పొలుచు నాకెపుడు చూపుల వెంట వెంట
భీష్మ నిర్యాణము
అనియిట్లు వలుకుచు నాపగేయుండు[130]
వనజాక్షుపై దృష్టివదలక నిలిపి
వాసిగా నిశ్వాసవాయువు లడఁచి
భాసురంబగు పరబ్రహ్మంబుఁ గలసె
[128] బలభేదిసుతుడు- ఇంద్రపుత్రుడు, అర్జునుడు
[129] వెల్లావిరిగ- వెల్లివిరియగ
[130] ఆపగేయుడు- నదీపుత్త్రుఁడు. భీష్ముఁడు.
481
దివమున ఘోషించె దేవదుందుభులు
దివిజసూనంబు లాధీరుపైఁ గురిసె
ఆయుధిష్ఠిరుఁడును నత్తాత కపుడు
సేయంగ గల పనుల్సేసె యచ్చోట
పనివడి యున్న తాపసుల వీడ్కొలిపి
అనుజ, శౌరి సమేతుఁడైనిజపురికిఁ
ధర్మరాజు ధరణి నేలుట
జనుదెంచి పెదతండ్రి సమ్మతిఁజేసి
యనువొంద నయశాలియైయుర్వి యేలె
ధర్మసూనుం డేలుతఱి నుర్వియందు
ధర్మము నాల్గు పాదంబులు నిలిచె
వాసుదేవుఁడు నిట్లు వసుమతీ భరము
నోసరించి[131] ప్రమోదయుక్తాత్ముఁ డగుచు
అనువుగాఁ గరివురియందె తాఁగొన్ని
దినములు నిలిచి కుంతీ, సుభద్రలకు
మునుకొని ప్రియవాక్యములు వల్కి ధర్మ
తనయుని వీడ్కొని తగు రథం బెక్కి
శ్రీకృష్ణుఁడు ద్వారక కరుదెంచుట
కనకదండంబుచేఁ గడునొప్పు గొడుగు
జననుతుండగు ధనంజయుడు వహింప
అమర నుద్ధవుఁడు సాత్యకియును విమల
చమరవాలంబలు సంగడి[132] విసరఁ
[131] ఓసరించు- తొలగించు
[132] సంగడిన్- జతకట్టి
491
గొనకొని కదలి యా కురుజాంగలాది
జనపదంబులు దాఁటి జలధిమధ్యమున
పొలుపారు ద్వారకాపురి ప్రవేశించి
కలిగిన బంధువర్గముల మన్నించి
అతిభక్తి, నెదురైన యాజననులకు
నతుఁడయి, వారిచే నందితుం డగుచు
పదియారు వేపురుపడఁతులం గూడి
విదిత భోగంబుల విహరించు చుండె”
ఉత్తరా విషయమై శౌనకుని ప్రశ్న
అనుటయు శౌనకుండాసూతుఁ జూచి
“అనఘాత్మ! ఉత్తర కటుల గర్భమున
నెసఁగిన యా బాలుఁ డేమయ్యె నాకు
వెసఁదెల్పు” మనుటయు విని సూతుఁ డనియె
సూతుని సమాధానము పరీక్షిజ్జననము
“ధర్మనందనుఁడు భ్రాతలఁ గూడి యటుల
ధర్మంబుఁ దప్పక ధరయేలు వేళ
ఉత్తర కడుపులోనున్న యా బాలుఁ
డుత్తమ జ్ఞానియై యొకనాడు లోన
అంగుష్ఠమాత్ర మోహనతర దేహు
సంగత రుచిజితసజలాంబువాహు
మకుట మనోహరమౌళిఁ గృపాళు
మకరకుండల రాజమాన కపోలు