పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : షష్ఠ స్కంథ - 22వ దశకము - అజామిళోపాఖ్యానము వర్ణనము

|శ్రీమన్నారాయణీయము||
షష్ఠ స్కంధము
22వ దశకము - అజామిళోపాఖ్యానము వర్ణనము

22-1-శ్లో.
అజామిలోనామ మహీసురః పురాచరన్ విభో! ధర్మపథాన్ గృహాశ్రమీ।
గురోర్గిరా కాననమేత్య దృష్టవాన్ సుదృష్టశీలాం కులటాం మదాకులామ్।।
1వ భావము:
భగవాన్! పూర్వము 'అజామిలుడు' అను ఒక విప్రుడు కలడు. అతను ధర్మమార్గమున జీవించు గృహస్థుడు. ఆ అజామిలుడు ఒకానొకనాడు తన గురువు (తండ్రి) ఆజ్ఞననుసరించి హోమసమిధలు తెచ్చునిమిత్తము అడవి మార్గమున వెళ్ళెను. అచ్చట అతనికి , విచ్చలవిడిగా విహరించుచున్న గుణహీనురాలైన ఒక యువతి తారసపడెను.

22-2-శ్లో.
 స్వతః ప్రశాంతో౾ పి తదాహృతాశయః స్వధర్మముత్స్యజ్య తయా సమారమాన్।
అధర్మకారీ దశమీభవన్ పునర్దధౌ భవన్నామయుతే సుతే రతిమ్।।
2వ భావము:
స్వాభావికముగా నిర్మల చిత్తుడైననూ, అజామిలుడు ఆ స్త్రీ బాహ్యసౌందర్యమునకు ఆకర్షితడయ్యెను. తాను వచ్చిన పనిని మరచి - స్వధర్మమును వీడి, ఆమెతో సహజీవము చేయుచూ కాలక్రమమున వృద్ధుడయ్యెను. అజామిలుని సంతతిలో నీ నామము పేరుగాకల 'నారాయణ' అను ఒక పుత్రుడు ఉండెను. ఆ 'నారాయణ' అనినచో అజామిలునికి మిక్కిలి వాత్సల్యము.

22-3-శ్లో.
స మృత్యుకాలే యమరాజకింకరాన్ భయంకరాన్ త్రీనభిలక్షయన్ భియా।
పురా మనాక్ త్వత్స్మ్ర్రుతివాసనాబలాజ్జుహావ నారాయణనామకం సుతమ్।।
3వ భావము:
వృద్ధుడైన అజామిలునికి మరణ సమయము ఆసన్నమయ్యెను. అప్పుడు అతనికి భయంకరులగు ముగ్గురు యమకింకరులు కనిపించిరి. వారిని చూచిన అజామిలుడు మిక్కిలి భయకంపితుడయ్యెను. ప్రభూ! అప్పుడు (పూర్వ జీవన సంస్కారము వలన) నీ నామము గల తన కుమారుడు నారయణను , "నారాయణా!" "నారాయణా!" అని గట్టిగా పిలిచెను.

22-4-శ్లో.
దురాశయస్యాపి నతదాస్యనిర్గతత్వదీయనామాక్షరమాత్రవైభవాత్।
పురో౾భిపేతుర్భవదీయపార్షదాశ్చతుర్భుజాః పీతపటామనోహరాః।।
4వ భావము:
చెడుతలంపులతో జీవించియుండిననూ - అజామిలుడు మరణాసన్న సమయమున (అప్రయత్నముగా నైననూ), నీ "నారయణ" నామమును పలికెను. అంతట ప్రభూ! మనోహరరూపులు, పీతాంబరధరులు అయిన నీ పార్షదులు, ఆ అజామిలుని ముందు వచ్చి నిలిచిరి.


22-5-శ్లో.
అముం చ సంపాశ్య వికర్షతో భటాన్ విముంచతేత్యారురుధుర్భలాదమీ।
నివారితాస్తే చ భవజ్ఞనైస్తదా తదీయపాపం నిఖిలం న్యవేదయన్।।
5వ భావము:
అజామిలుని తమపాశములతో యమభటులు లాగుకొని పోవుచుండగా, అతనిని వదలివేయమని, విష్ణు పార్షదులు వారిని గట్టిగా అడ్డగించిరి. అట్లు అడ్డగించబడిన యమకింకరులు - విష్ణు పార్షదులకు, అజామిలుని పాపపంకిల జీవితవృత్తాంతము నంతయు తెలిపిరి (అతనికి యమలోకమే సరియైనది అని అనిరి).


22-6-శ్లో.
భవంతుపాపాని కథం తు నిష్కృతే కృతే౾పి భో! దండనమస్తి పండితాః।।
న నిష్కృతిః కిం విదితా భవాదృశమితి ప్రభో! త్వత్పురుషా బభాషిరే।।
6వ భావము:
అంతట విష్ణు పార్షదులు యమకింకరులతో - "అజామిలుడు పాపాత్ముడేయైనను - పాప విముక్తుడయిన పిదప దండన ఉండునా! విజ్ఞులయిన మీకు ఇతని పాపవిముక్తి ఎట్లయ్యెనో తెలయకుండునా?" అని పలికిరి.


22-7-శ్లో.
శృతి స్మృతిభ్యాం విహితా వ్రతాదయః పునంతి పాపం న లువంతి వాసనామ్।
అనంతసేవా తు నికృంతతి ద్వయీమితి ప్రభో! త్వత్పురుషా బభాషిరే।।
7వ భావము:
మరల వారు ఇట్లనిరి. "శృతి స్మృతులందు వేదవిహితముగా చెప్పబడిన వ్రతములు - పాపములను హరించును. కాని అవి జీవుని అంటిపెట్టుకొనియుండు కర్మఫలముల వాసనను మాత్రము హరింపజాలవు. అనంతుని సేవ (హరినామ స్మరణ) మాత్రమే వారి పాపములను మరియు పాపకర్మల వాసనను నశింపజేయును", అని పలికిరి.


22-8-శ్లో.
అనేన భో! జన్మ సహస్రకోటిభిః కృతేషు పాపేష్వపి నిష్కృతిః కృతా।
యదగ్రహీన్నామ భయాకులో హరేః ఇతిప్రభోః త్వత్పురుషా బభాషిరే।।
8వ భావము:
"అజామిలుడు అవసాన సమయమున యమభటులను చూచి భయకంపితుడై (అసంకల్పితముగానయినను - ఆర్తిగా) హరినామమును ఉచ్ఛరించెను. ఫలితముగా - వేలకోట్ల జన్మలయందు తానుచేసిన పాపములనుండి సహితము విముక్తుడయ్యెను"; అని ప్రభూ! నీ పార్షదులు యమదూతలతో పలికిరి.


22-9-శ్లో.
వృణాముబుద్యాపి ముకుందకీర్తనం దహత్యఘౌఘాన్ మహి౾ మాస్య తా దృశః।
యథాగ్నిరేధాంసి యథౌషధం గదానితి ప్రభో! త్వత్పురుషా బభాషిరే ।।
9వ భావము:
"అగ్ని కట్టెను దహించునట్లును, ఔషధము రోగమును హరించునట్లును - నరునిచే చేయబడిన 'ముకుందకీర్తన' సమస్త పాపములను హరించును. హరినామ మహిమ అట్టిది" - అని ప్రభూ! నీ పార్షదులు తెలిపిరి.


22-10-శ్లో.
ఇతీరితైర్యామ్యభటైరపాసృతే భవద్భటానాం చ గణే తిరోహితే।
భవస్మృతిం కంచన కాలమాచరన్ భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ।।
10వ భావము:
హరినామ మహిమను - నీ పార్షదులు అట్లు వివరించగా, యమభటులు ఆ అజామిలుని వదిలిపెట్టిరి. విష్ణుదూతలుకూడా అంతర్ధానమయిరి. పిదప అజామిలుడు నీ నామస్మరణలో తన శేషజీవితమును గడిపి, ప్రభూ! విష్ణుదూతలు వెంటరాగా నీ సాన్నిధ్యమును చేరెను.


22-11-శ్లో.
స్వకింకరావేదనశంకితో యమస్త్వదంఘ్రిభక్తేషు న గమ్యతామితి।
స్వకీయభృత్యానశిశిక్షదుచ్ఛకైః స దేవ! వాతాలయనాథ! పాహిమామ్।।
11వ భావము:
యమభటులు యమధర్మరాజు వద్దకు తిరిగివెళ్ళి అజామిలుని వృత్తాంతమునంతయూ తెలిపిరి. అప్పుడు యమధర్మరాజు తనభృత్యులను 'హరిభక్తుల వద్దకు మాత్రము' వెళ్ళవలదని హెచ్చరించెను. అట్టి మహిమ కలిగిన ఓ! గురవాయూరుపురాధీశా! నన్ను రక్షింపుము.


షష్ఠ స్కంధము
22వ దశకము సమాప్తము.
-x-