ద్విపదభాగవతం - కల్యాణకాండ : సత్రాజిత్తు శ్రీకృష్ణుడు మణి నపహరించెనని సందేహించుట
“కటకటా! అడవికొక్కరుఁడునుఁబోయెఁ
గుటిలత నెవ్వరు కూల్చిరోగాక!
తనకు నమ్మణి యీని తప్పున శౌరి
మన ప్రసేనుం బట్టి మడియింపఁబోలు!
అతఁడేల లోబడు నన్యులచేత?
ఇతరులీ సాహసంబేల కావింత్రు?
అడిగిన యీనేరకనుజన్ముఁ గోలు
పడితినక్కట!” అని పలవింపుచుండ
విని పౌరులెల్లను విష్ణుని దలఁచి
యనుమానపడుచుండ నామాటలెఱిఁగి. 360
యపరిమితజ్ఞాని యగు శౌరి యట్టి
యపకీర్తి నెబ్భంగి నడఁగింతు ననుచు
నడవికిఁ దను బౌరులందఱుఁ గొలువఁ