ద్విపదభాగవతం - కల్యాణకాండ : చిత్రరేఖ తన మాయచే ననిరుద్ధుని యపహరించుట
“పైదలి! నీదైన భాగ్యంబు కతన
యాదవోత్తముఁడైన హరిపౌత్రుడబ్బె!
ఆ సుందరాకారు నర్మిలిఁ దెచ్చి
నీ సమ్ముఖమువేసి నెమ్మివాటింతు.
వెఱవాయు”మనిపల్కి వెలఁది బోధించి
తెఱవ మాయాగతి దివమున కెగసి
రాజీవనేత్రి సురక్షితంబగుచు
రాజితంబైన ద్వారకకేఁగి యందు
యువిదలతోఁగూడి యుద్యానభూమిఁ
దవిలి రతిక్రీడఁ దనిసి నిద్రించు
యనిరుద్ధుఁగాంచి మాయలుఁగొల్పి యెత్తు
కొని వియద్గతి వచ్చి కోర్కులు బొదల 850
బాణతనూజ తల్పము క్రేవఁబంచ