ద్విపదభాగవతం - కల్యాణకాండ : బలరాముఁడు రుక్మిని జూదపు పలకనెత్తి కొట్టి చంపుట
అనిపల్కి ప్రహసించి యార్చువైదర్భుఁ
గని సీరి మిడుగులు కన్నులఁదొఱుఁగఁ
బటురోషముననెత్తి పలక వేత్రిప్పి
నిటలంబు వ్రేయఁ బెన్నెత్తురు దొఱఁగి
వెడవెడ మిడి గ్రుడ్లు వెడలి రోఁజుచును
పడి తన్నుకొని రుక్మి ప్రాణంబు విడిచె!
కాళింగుఁ జంపి యక్కడి ధూర్తసమితిఁ
ద్రోలిన నందఱుఁ దుప్పలఁ దూలి 750
పులిగన్న పసులను బోలి వైదర్భు
బలము భీతిల్ల సంభ్రమమేచఁ బఱచె;
హరివచ్చిదేమిదేమని చూచుచుండ
నరదంబు వెసనెక్కి హలధరుఁడంత
లోచనతోననిరుద్ధు నెక్కించి
వేచని యావురి వెలవెలనున్న
నా రుక్మి మడియుట (నం)తయు నెఱిఁగి
శౌరి సీరినిగూడి చనియె ద్వారకకు;
అరసి దుఃఖాక్రాంతయైన రుక్మిణిని
గరమర్ధిఁ గుందార్చెఁ గమలలోచనుఁడు.