ద్విపదభాగవతం - కల్యాణకాండ : అక్రూరుని శ్రీకృష్ణుఁడు పిలిపించి బుద్ధులు చెప్పి మఱల వానికే మణిని ప్రసాదించుట
మని చూచి శౌరియు నక్రూరుఁ బ్రేమఁ
బనివడి దూతలఁ బంచి రప్పించి
యతనితో నొక్కనాఁడతి రహస్యమున
శతదళనేత్రుఁడు చతురుఁడై పలికె.
“అడరి సత్రాజిత్తు నడఁచి మాణిక్య
మురవడిఁ గొంపోవ నొగి వెంటఁ దగిలి
శతధన్వు నూరకె జంపితి గాని
యతులితంబగు రత్నమతనిచేఁ గాన
మక్కటా! శ్రీ ధనంబది పాడిగాదు
యిక్కువ జ్ఞాతులకిది యహితంబు
నీయింట నతని మానికముండె గాన
యీయధ్వరములు నీకిటు సేయఁగల్గె
నిది నాకు బ్రియ”మన్న నిందిరావిభుని
పదపంకజములకుఁ బ్రణమిల్లి యతఁడు
“గోవింద! కృష్ణ! ముకుంద! మురారి!
పావనగుణపూర్ణ! పద్మాయతాక్ష!
సర్వాత్మలందును జరియించు నిన్ను
సర్వేశ !ఎఱుఁగంగఁ జనునయ్య నాకు” 460
అని పల్కి హరిచేతి కక్రూరుఁడెలమి
తనరార నాస్యమంతక మిచ్చి మ్రొక్కె,
శౌరి సంతసమంది జ్ఞాతులు చూడఁ
గోరి యారత్నమక్రూరునకిచ్చె!
“ఈ కథ విన్న మీకీప్సితార్థములు
ప్రాకటంబుగ నిచ్చు భవబాధలుడుగు
నపకీర్తులడగించు నఘములుఁ జెఱచుఁ
గపటంబులెడలు మంగళములు నిచ్చు”
ననిచెప్పి మరియును నంబుజోదరుఁడు