ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణుఁడు సత్రాజిత్తుని శ్యమంతకమణిని యాచించుట
నకుటిలచిత్తుఁడై యబ్జాక్షుఁడనియె;
“ఈ రత్న మిమ్ము నీ కేవస్తువైనఁ
గోర నీకిచ్చెదఁ గొను”మన్న నృపతి
“కనకంపుమాడలుఁ గడఁగి యిచ్చలును
నెనిమిది బారువులిచ్చు నీరత్న
మెవ్వరిచే నున్న నీతిబాధలను,
[నీతిబాధలుడుగు]
జివ్వయు దురితముల్ చెందవు నరుల
[దురితంబు]
నినదత్తమీరత్న మీనోప” ననుచు
ధనలోభమున బల్కెఁ దగువాఁడు దన్ను
నడిగిన వస్తువు లడఁచి యీనేర
కడలిన దుఃఖార్తులగుటెందు నరుదె!