ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణుఁడు రుక్మిణిని దనరథముపై నెక్కించుకొని చనుట
ఆ కన్యయును బ్రేమ నంబుజోదరుని
రాకాశశాంకవిరాజితవదను
మకరకుండలకర్ణమాణిక్యరుచిర
వికచగండస్థలు విభవేంద్రవంద్యుఁ
నారూఢయవ్వను సతులసౌభాగ్యు
నారాయణుని హరిన్నళినాక్షిఁ గాంచి
సిగ్గును భయమును జిడిముడిపాటు
నగ్గలింపఁగ నిల్చె నంబుజనయన;
ఆలోనఁగృష్ణుఁడు నవ్వాలుగంటి
నాలింగనముసేసి యర్మిలినెత్తి 150
కొనిపోయి రథముపైఁ గూర్చుండఁ బెట్టి
యనునయోక్తులఁ దేర్చి యంగంబు నిమిరి
దారకుఁ జూచి “రథము వేగ పఱవు
ద్వారకాపురి”కని దైత్యారి కదలె.