పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణుఁడు పాండవుల క్షేమవార్తల నరయుట

“అక్కటా! దుర్మదుగు శత్రుజనులు
పెక్కు పాటుల మిమ్ముఁ బెట్టంగ వినుచు
నొప్పగించిన యట్టులుంటిమి గాని
ప్పటప్పటికి మిమ్మరయంగ లేక
దైవంబుకతన నింటి బాధలుడిగె
నేవిధంబునఁ బుణ్యులీలోకములును;” 
వుఁడు ధర్మరాజా కృష్ణుఁ జూచి
వియ బాంధవములు వెలయనిట్లనియె. 
“అఘాత్మ! నీ మర్మరయక యున్న
నేర్తుమే మేము ర్త్యులలోన? 
ల్లియుఁ దండ్రియుఁ దైవంబు గురుఁడు
నెల్ల బాంధవులును నిల నీవె మాకు! 
ఈ కొద్ది వాక్కేల నిహపరంబులకు
మాకెవ్వరున్నారు? ధుకైటభారి!”
నుచు మజ్జన భోజనాది సత్కార
వియోపచారాది విధులఁ బూజింప     480
రియుఁ బాండవులును న్యోన్య మైత్రి
నురుతరంబుగ నుండ నొకయేఁడు చనియె.