ద్విపదభాగవతం - కల్యాణకాండ : శంబరప్రద్యుమ్నుల యుద్ధము
నతివేగమునను మహాగ్రహంబొదవ
మదనునిఁ దెగటార్ప మది విచారించి
గదఁగొని లయకాలకాలుఁడోఁ యనఁగఁ
బఱతెంచి వైచిన భావజుండలిగి
యఱక యాతని వక్షమురుముష్టిఁ బొడిచె;
వాఁడు మహాశక్తి వైచిన మరుఁడు
పొడిగాగ నది ద్రుంచెఁ బుడక చందమున.
అప్పుడయ్యసుర మహాబలం బొదవ
నుప్పరంబెగసి పై నురగమై పడిన
గరుడుఁడై యాపాము ఖండించెమరుఁడు;
తిరుగక దనుజుఁడు ధీరుఁ డై పేర్చి
వనదమైఁ పాషాణవరుషంబుఁ గురియ
ననిలుఁడై విరియించె, నద్రియై పడిన
కులిశమై దునుమాడె, కొంకొక వాఁడు
కలుషించి కేల ఖడ్గము నెత్తుకొనుచు 310
బలువిడిఁ గవిసిన భావసంభవుఁడు
తలఁ ద్రెవ్వనేసె నుద్ధతకోవుఁడగుచు,
దేవసంఘములార్చె దివిఁ బుష్పవర్ష
మావిష్ణుతనయుపై నందంద కురిసె.