ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీ కృష్ణుఁడు సుదాముఁడను పుష్పలావికుని యనుగ్రహించుట
అరుగుదేర సుదాముఁ డను పుష్పలావుఁ
డరిగి యెదుర్కొనె నత్యంతభక్తి
బలరామ కృష్ణుల పాదాబ్జములఁ
జెలువారఁ బూజించి చెంగల్వదండ
లిరువురకును నిచ్చి యింపు సొంపార
విరు(లమాలి)క లిచ్చి వెస వేయు గతులఁ
గీర్తింపఁ గని హృషీకేశుండు శౌరి
యార్తరక్షణశీలి యతని మన్నించి
వరము వేడు” మటన్న వాఁడు “మీ పాద
సరసిజంబులుఁ గొల్చు సద్భక్తి నాకు
దయసేయు” మనుడు నాతనిఁ దన్పుసేసి
నయమైన తత్ప్రసూనములర్థిఁ దాల్చి
మనమున హర్షించి మరలిపోవంగఁ