ద్విపదభాగవతం - మధురకాండ : కంసుఁడు శ్రీకృష్ణునిచేఁ దన ధనుర్భంగమును విని విచారించుట
తన కలంకుల నున్న దానవాధిపులఁ
గనుఁగొని పలికె నుత్కట కోప మెసఁగ.
కోపించి “వసుదేవుఁ గొడుకులు నేఁడు
నా పట్టణముఁ జొచ్చి నా విల్లు విఱిచి
చలము చేకొని ధనుశ్శాల నున్నారు.
బలసి మీ రందఱు బలశక్తి మెఱసి
వారల నిద్దఱ వధియింపు డొండె
కారాగృహాన నుక్కరఁ బెట్టు డొండె.”