ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : సాంబుఁడు దుర్యోధనుని కుమార్తె లక్షణ నపహరించుట
అంబుజోదరపుత్రుఁ డతిరథోత్తముఁడు
జాంబవతేయుండు సాంబుఁడు ఘనుఁడు
కోరి ధుర్యోధను గూఁతు లక్షణను
వారణవురి స్వయంవరమునందునను
వరియించి కొనిపోవ వారలందఱును
గురుపతి కెఱిఁగింపఁ గోపించి యతఁడు
“ఏమేమిరా! సాంబుఁడే నాతనూజ
నేమని కొనిపోయె నెట్లు జూచితిరి?
కురువంశజులతోడఁ గూడి యాదవులు
పరిణయప్రాప్తులే పరికించి చూడ?
పడుచువాఁడీకన్య బలిమిఁ గొంపోవఁ
దడయకఁ జూచుట తగవుగా దతని
బట్టి తెత్త” మటంచు బలములతోడ
దట్టుఁడై వడి సుయోధనుఁ డుగ్రవృత్తి
వెడలి యార్పుచుఁ దాఁకి విష్ణునందనుని
దడయక శస్త్రాస్త్రతతుల నొప్పింపఁ 260
గనిపోయి తిరిగి యగ్గలికమై వేఁచి
తన రథంబఖిలవర్తనలఁ గ్రీడింపఁ
బడియార్చి విలుగుణధ్వని చేసి శరము
లడరింపఁ గురుసేన నందొక్కపెట్ట
మురిసె రథంబు లమ్ముల గీటణంగెఁ
గరులు రోఁజుచుఁగూలెఁ గాల్బలం బణఁగెఁ
దరమిడి సాంబు కోల్తల కోహటించి
తిరిగిసేనలు రాజు దిక్కున కొదుఁగ
గినిసి యాతని శల్యకేతుఁడు దాఁకఁ
గని రాజుతమ్ముఁడు గర్ణ సౌబలులు
వెనుఁ బ్రావుగా బాణవృష్టి వేల్పుటయు
ధనువుసారించి యా దైత్యారి సుతుఁడు
కాఁడగ నేడు మార్గణముల సేసి
యేడు బాణముల మహీశు నొప్పించి
యతని తమ్ముని నాల్గుటమ్ములఁ గ్రుచ్చి
శతసాయకంబులు శకునిపైఁ గప్పి
తొలఁగక శల్యకేతుని విల్లుఁ దునిమి
బలముల శరపరంపరలఁ గూల్చుటయు
నతని విక్రమకేళి కచ్చెరువంది
యతులితంబగు యోధులందఱుఁ గూడి - 270