పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : నారదుని యాగమనము

ని దూత వినుతింవ నంత నారదుఁడు
నుదెంచె దివినుండి శౌరిసన్నిధికి. 
మ్ముని కెదురేఁగి ర్హపీఠమున
నిమ్ముల నిలిపి మోమీక్షించి పలికె. 
“మునినాథ! త్రిభువనంబుల వార్తలెల్ల
నదివ్యదృష్ఠిని ననివిలేవు!  - 450
మి విశేషంబు లెఱిగింపు” మనిన
ముని నవ్వుచు రిఁ జూచి పలికె. 
“నీమహత్వంబున నిఖిలంబుఁగాంతు
నీమాయకడఁగాన నేరకున్నాఁడ! 
కోరి నీ మేనత్తకొడుకు ధర్మజుఁడు
సూరివంద్యుఁడు రాజసూయాధ్వరంబుఁ
జేయనుద్యోగించి చెచ్చెర నిన్ను 
శ్రీయుక్తి నాచార్యుఁ జేయనున్నాఁడు! 
మఘంబీక్షింప ఖిలదేవతలు
భూమీశ్వరులు వేడ్కఁ బోవుచున్నారు
నీరజాయతనేత్ర నీవువిచ్చేసి
బోరున రిపుకోటిఁ బొరిమార్చు వేగ
చ్చట, శిశుపాలు డరి నీచేత
చ్చు నీపయనంబు మకూర్పవలయు; 
పొరి జరాసంధుఁ నుబొరిమార్ప నెట్టి
వీరున కెందును వెరవుగాదెందు! 
తఁడు భీమునిచేత ట మల్లయుద్ధ
హతుఁడౌను యన్యుల కతఁడజేయుండు. 
భీమునిచేతను బెరపెట్టి చంపు
నే మీకు నెఱిఁగింప నేతెంచినాఁడఁ - 460