ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : ధర్మజాదులు శ్రీకృష్ణుని సమ్మానించుట
అమ్మహాత్మునిరాక యరసి ధర్మజుఁడు
తమ్ములుఁ దాను బాంధవులతో నెదురు,
వచ్చి నమ్రుండైన వసుదేవతనయు
గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చె; గోవిందు డంత
ననిలనందను బ్రేమ నక్కునఁ జేర్చి
తనకు మ్రొక్కిన మాద్రి తనయుల నరుని
3-20 ననువార నాలింగనము సేసి వార
లందఱుఁ గొల్చిరా నమరేంద్రులీలఁ
జెంది యప్పురిఁ ప్రవేశించె మురారి.
పౌరుల కన్నులపండువ గాఁగ
భూరిపుణ్యుఁడు పాండవుల నగరికిని
నరిగి కుంతికి మ్రొక్క నమ్మహాదేవి
కరమొప్పఁ గృష్ణుని గౌఁగిటఁ జేర్చి
యానందరసముబ్బి యలుగులుఁ బారఁ
బూని యందఱఁ బ్రేమఁబూజించి కుంతి
పాంచాలసుతయు సుభద్రయుఁ గృష్ణుఁ
గాంచి సాష్టాంగంబు కరమర్థి నెఱఁగి
హరి కాంతలును దాను నన్యోన్య ప్రేమ
బరిరంభణముల సంభావన క్రియల
సలిపి యింపార మజ్జనభోజనములఁ
గలసి క్రీడించిరి; కమలాక్షుఁడంత
నాపాండవుల సేమమంతయు నడిగి
యాపార్థు గృహమున కరుగ నన్నరుఁడు
మజ్జనభోజన మహిత సౌఖ్యముల
నజ్జగన్నాథుని నతిభక్తిఁ దనిపి - 500
హంసతూలిక పాన్పునందు సంప్రీతిఁ
గంసారి నునిచి కాల్గడనుండి క్రీడ
నడుగు లొత్తుచు నుచితాలాప లీలఁ
గడఁగి వినోదింపగా ధర్మసుతుఁడు
చనుదెంచుటయు శౌరి చయ్యన లేచి
తనర నానృపు కరస్థలిబట్టి తివియ
నేక శయ్యను వారలిరువురు నుండఁ
జేకొని తమ్ములు సేవించియుండ
“నారగించుము కృష్ణ! అలసితీ” వనుచు
3-20 ఒకే పాదమున్నది