పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : చంపకమాల

2 చంపకమాల

త్రిభువనవంద్య గోపయువతీజన సంచిత భాగధేయ రుక్
ప్రభవ సముత్క రోజ్వల శిరస్థ్సిత రత్న మరీచి మంజరీ
విభవ సముజ్జ్వల త్పదారవింద ముకుంద యనంగ నొప్పు నా
జభములు జాత్రిరేఫములుఁ జంపకమా లగు నాదిశాయతిన్.

గణ విభజన
III IUI UII IUI IUI IUI UIU
త్రిభువ నవంద్య గోపయు వతీజ నసంచి తభాగ ధేయరుక్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 21
ప్రతిపాదంలోని గణాలు న, జ, భ, జ, జ ,జ, ర
యతి ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య - 486
ఉదాహరణ

భా853చ.
పదములఁ బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
మదగజవల్లభుండు ధృతిమంతుఁడు దంత యుగాంత ఘట్టనం
జెదరఁగఁ జిమ్మె న మ్మకరి చిప్పలు పాదులు దప్ప నొప్పఱన్
వదలి జలగ్రహంబు కరి వాలముమూలముఁ జీరెఁ గోరులన్.