పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : తోటకము

11 తోటకము

జలజోదర నిర్మల సంస్తవముల్
విలసిల్లెడుఁ దోటకవృత్తమునన్
బొలుపై స చరుష్కముఁ బొందగ నిం
పలరారఁగఁ బల్కుదు రష్టయతిన్.

గణ విభజన
IIU IIU IIU IIU
జలజో దరని ర్మలసం స్తవముల్
(4 'స' గణములు)
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 12
ప్రతిపాదంలోని గణాలు: స, స, స, స
యతి : ప్రతిపాదంలోనూ 9 వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా6531తో.
కరుణాకర! శ్రీకర !కంబుకరా!
శరణాగతసంగతజాడ్యహరా!
పరిరక్షితశిక్షితభక్తమురా!
కరిరాజశుభప్రద! కాంతిధరా!