పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : ప్రాచీన ప్రదేశాలు - ప్రస్తుత పేర్లు


భాగవతము.
ప్రాచీన ప్రదేశాలు - ప్రస్తుత పేర్లు

  (సాంఘిక మాధ్యమాల నుండి చేసిన సంకలనం)

1. అంగ రాజ్యం - కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
2. అశోకవనం (9-311-వ.) - సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
3. ఆయోధ్య (9-266-క.) - శ్రీరాముని జన్మస్థలం, - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
4. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
5. కారుష రాజ్యము - దంతవక్రుని రాజ్యం, (9-722-వ.) - దాంతియ జిల్లా, మధ్యప్రదేశ్.
6. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన (10.1-1639-ఉ.) స్థలం - గిర్నార్, గుజరాత్.
7. కిష్కింద - ఆంజనేయ పర్వతం, హనుమంతుడి జన్మస్థలం, (2) సుగ్రీవుని రాజ్యం, (3) ఋష్యమూక పర్వతం (9-271-వ. - తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక
8. కుండినపురము - రుక్మిణిదేవి జన్మస్థలం, విదర్భ ముఖ్యపట్టణము, (10.1-1687-చ.) - కుండినపుర, మహరాష్ట్ర
9. కుంతి - పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు - గ్వాలియర్.
10. కుచేలుడు (10.2-965-సీ.) నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
11. కోసలదేశం(9-362-ఆ.) - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
12. ఖాండవవనము / ఇంద్రప్రస్థము - పాండవుల రాజధాని, (1-361-క.) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
13. గంగాసాగర్,- కపిల మహర్షి ఆశ్రమం, శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది (9-231-మ.), వెస్ట్ బెంగాల్
14. గంగోత్రి - భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం (9-230-వ.), ఉత్తరాఖండ్
15. చిత్రకూటం (9-267-క.) - సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
16. చేది రాజ్యము - శిశుపాలుని రాజ్యం, (10.1-1697-ఉ.) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
17. జనమేజయుడు సర్పయాగం (12-26-వ.) చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
18. జరాసంధ్ కీ ఆఖరా జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్. (10.2-718-వ.)
19. దండకారణ్యం (9-268-ఉ.) - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
20. ద్వారక - శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరము (10.1-1615-వ.) - ద్వారక,గుజరాత్.
21. నిషాద రాజ్యం (10.2-348-ఉ.) నల మహారాజు రాజ్యం - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్.
22. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్.
23. నైమిశారణ్యం (1-39-వ.) వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు, పురాణాలు బోధించిన ప్రాంతం - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
24. పంచవటి - శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం (9-269-సీ.) - నాసిక్, మహరాష్ట్ర.
25. పాంచాల దేశం - ద్రుపద మహారాజు రాజ్యం, (1-365-సీ.) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
26. పాండవుల, లాక్షగృహ (3-14-క.) దహనం- వర్నాల్, హస్తినాపూర్.
27. ప్రతిష్టానపురము (9-32-వ.) పురూరవుని రాజధాని -ఝున్సి, అలహాబాద్.
28. ప్రభాస తీర్థం (11-87-సీ.) - శ్రీ కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి జరిపిన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
29. ప్రాగ్జ్యోతిష్యం - నరకాసురుని రాజధాని (10.2-156-వ.) - తేజ్ పూర్, అస్సాం.
30. మత్స్య దేశం (1-243-వ.) విరాట మహారాజు రాజ్యం -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
31. మద్ర దేశం - పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు, (3-62-మ.) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
32. మధుర - కంసుని రాజధాని, (10.1-18-వ.) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
33. మహావిష్ణువు గజేంద్రుడిని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం (8-42-మ.) - గజేంద్ర ధామ్, దేవ్ ధాం, మానససరోవరము దగ్గరలో, నేపాల్.
34. మహీష్మతి పురము (9-434-క.) - కార్తవీర్యార్జునుని రాజధాని -మహేశ్వర్, మధ్యప్రదేశ్
35. మహేంద్రము (5.2-55-వ.) అను పర్వతం , పరశురాముడు తపస్సు చేసిన స్థలం - పశ్చిమ ఒరిస్సా
36. మిథిల - సీతాదేవి పుట్టినిల్లు (9-372-వ.) - జనక్ పూర్, నేపాల్
37. వాల్మీకి ఆశ్రమం (9-346-సీ.) - సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరములోని బితూర్.
38. విదర్భ - రుక్మిణిదేవి తండ్రి రాజ్యం, (10.1-1687-చ.) - విదర్భ, మహరాష్ట్ర
39. విభీషణుడు రాముని శరణు కోరిన (9-289-వ.) స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
40. విరాటనగరము - పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం (1-243-వ.) - విరాట్ నగర్,రాజస్థాన్
41. వ్రేపల్లె / గోకులం - (10.2-186-వ.) గోకుల్, మధుర దగ్గర.
42. శమంత పంచకము (9-487-వ.) పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో అయిదు మడుగులు నెలకొల్పిన చోటు మరియు భీముడు దుర్యోధనుని చంపిన చోటు - కురుక్షేత్రము దగ్గర, హర్యానా
43. శోణపురము - బాణాసురుడి రాజధాని (10.2-318-వ.) - సోనిత్ పూర్, అస్సాం.
44. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు (9-288-క.) - రామేశ్వరము,తమిళనాడు
45. సరయూ నది (9-211-చ.) - ఈ నదీ తీరములోనే అయోధ్య నిర్మితమైనది - ఘాఘర నది.
46. సాళ్వ రాజ్యం - జరాసంధుని మిత్రులలో ఒకడు సాళ్వ దేశపువాడు, (10.1-1682-మ.) - కురుక్షేత్రము దగ్గర.
47. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ,
48. హస్తినాపురము - కౌరవుల రాజధాని, పరీక్షిత్తుని రాజధాని, (1-78-వ.) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.