పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : ఏక చతుఃశ్లోకీ భాగవతములు

ఏకశ్లోకి భాగవతం


శ్లో.

అద్ధౌ దేవకి దేవి గర్బజననం గోపీ గృహేర్వర్దనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్దనోధ్దారణం
కంసఛ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాపాలనం
ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణలీలామృతం.



చతుశ్లోకీ భాగవతం

పుండరీకాక్షుండు బ్రహ్మకుపదేశించుట -స్కంధము 2 – అధ్యాయము 9 - వ్యాసవిరచితం

శ్రీభగవానువాచ


  1. శ్లో.

    ఙ్ఞానం పరమగుహ్యం మే యద్విఙ్ఞానసమన్వితమ్
    నరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా.

  2. శ్లో.

    యావా నహం యథా భావో య ద్రూప గుణకర్మకః
    త దైవ తత్త్వవిఙ్ఞాన మస్తు తే దనుగ్రహాత్.
    అహ మే వాస మోకోగ్రే నాన్యద్యత్సద నత్పరమ్
    పశ్చా దహం యదే తచ్చ యో౬వశిష్యేత సో స్మ్యహమ్

  3. శ్లో.

    ఋతేర్థం య త్ప్రతీయ త నప్రతీయే నచాత్మని
    త ద్విద్యా దాత్మనో మాయాం యథాభాసో యథాతమః.
    యథా మహాంతి భూతాని భూతేషూచ్చా వచేష్వను
    ప్రవిష్టా న్యప్రవిష్టాని తథా తేషు న తే ష్వహమ్.

  4. శ్లో.

    ఏ తావదేవ జిఙ్ఞాస్యం తత్త్వజిఙ్ఞాసునాత్మనః
    అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా.
    ఏతన్మతం సమాతిష్ట పరమేణ సమాధినా
    భవాన్ కల్పవికల్పేషు న విముష్యతి కర్హి చిత్.



పోతన భాగవతము

ద్వితీయ స్కంధము

2-249-క.
"వారిజభవ శాస్త్రార్థ వి
చాజ్ఞానమును భక్తి మధికసాక్షా
త్కాములను నీ మూఁడు ను
దాత నీ మనమునందు రియింపనగున్.

2-250-సీ.
రికింప మత్స్వరూస్వభావములును;
హిమావతార కర్మములుఁ దెలియు
త్త్వవిజ్ఞానంబు లకొని మత్ప్రసా;
మునఁ గల్గెడి నీకుఁ మలగర్భ!
సృష్టిపూర్వమునఁ జర్చింప నే నొకరుండఁ;
లిగి యుండుదు వీతర్మి నగుచు
మధిక స్థూల సూక్ష్మస్వరూపములుఁ ద;
త్కారణ ప్రకృతియుఁ గ మదంశ
2-250.1-ఆ.
మందు లీనమైన ద్వితీయుండనై
యుండు నాకు నన్య మొకటి లేదు
సృష్టికాలమందు సృజ్యమానం బగు
గము మత్స్వరూప గును వత్స!

2-251-క.
యఁగఁ గల్పప్రళయాం
మున నాద్యంత విరహిక్రియతోడం
రిపూర్ణ నిత్య మహిమం
మాత్ముఁడనై సరోజవ యే నుందున్.

2-252-వ.
అదియునుంగాక నీవు నన్నడిగిన యీ జగన్నిర్మాణ మాయా ప్రకారం బెఱింగింతు; లేని యర్థంబు శుక్తిరజతభ్రాంతియుంబోలె నేమిటి మహిమం దోఁచి క్రమ్మఱఁ దోఁపకమాను నదియె మదీయ మాయావిశేషం బని యెఱుంగు; మదియునుంగాక లేని యర్థంబు దృశ్యమానం బగుటకును, గల యర్థంబు దర్శనగోచరంబు గాకుండుటకును, ద్విచంద్రాదికంబును దమఃప్రభాసంబును దృష్టాంతంబులుగాఁ దెలియు మే ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబు లయిన ఘటపటాదు లందుఁ బ్రవేశించి యుండు నా ప్రకారంబున నేను నీ భూతభౌతికంబు లయిన సర్వకార్యంబు లందు సత్త్వాది రూపంబులం బ్రవేశించి యుందు; భౌతికంబులు భూతంబు లందుం గారణావస్థం బొందు చందంబున భూత భౌతికంబులు గారణావస్థం బొంది నా యందు నభివ్యక్తంబులై యుండవు; సర్వదేశంబుల యందును, సర్వకాలంబుల యందును నేది బోధితంబై యుండు నట్టిదియ పరబ్రహ్మస్వరూపంబు; తత్త్వంబెఱుంగ నిచ్ఛించిన మిము బోఁటి వారలకు నీ చెప్పిన మదీయ తత్త్వాత్మకంబైన యర్థంబ యర్థం బని యెఱుంగుదురు; ఈ యర్థం బుత్కృష్టం బయినయది యేకాగ్రచిత్తుండవై, యాకర్ణించి భవదీయచిత్తంబున ధరియించిన నీకు సర్గాది కర్మంబు లందు మోహంబు సెందకుండెడి;"