పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ రుక్మిణీ కల్యాణము : వాసుదే వాగమన నిర్ణయము

35

అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాదివిశేషంబులును విని, యవధరించి నిజకరంబున నతని కరంబుఁబట్టి నగుచు న య్యాదవేంద్రుం; డిట్లనియె

భావము:- ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు అవి గ్రహించి, శ్రీకృష్ణుడు అతని చేతులో చేయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు.

36

"న్నియమీఁద నా తలఁపు గాఢము; కూరుకురాదు రేయి నా
కెన్నఁడు; నా వివాహము సహింపక రుక్మి దలంచు కీడు నే
మున్నె యెఱుంగుదున్; బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి
ద్వన్నుత! మ్రానుఁ ద్రచ్చి నవహ్నిశిఖన్ వడిఁదెచ్చు కైవడిన్.

భావము:- “విద్వాంసుల ప్రసంశలు గైకొన్న బ్రాహ్మణోత్తమా ! రుక్మిణిపై నాకు గాఢానురక్తి గలదు. ఆమెపైన తలపులవలన నాకు నిద్ర రాదు. ఆమెతో నా వివాహము నోర్చని రుక్మి యొక్క దురాలోచనలు నాకు తెలుసు. శత్రుమూకల నణచి , కట్టెను మథించి దీపశిఖను తెచ్చునట్లు ఆమెను నేను తీసుకువస్తాను.

37

చ్చెద విదర్భభూమికిఁ;
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు చ్చినఁ బోరన్."

భావము:- విదర్భలోని భీష్మకుని కుండినపురానికి వస్తాను. రుక్మిణీబాలను అలవోకగా తీసుకు వస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్ధము చేసి చిటికలో చీల్చి చెండాడుతాను.” అని విప్రునితో అంటున్నాడు శ్రీకృష్ణుడు.

38

అని పలికి, రుక్మిణీదేవి పెండ్లినక్షత్రంబుఁ దెలిసి, దన పంపున రథసారథి యైన దారకుండు సైబ్య సుగ్రీవ మేఘ పుష్పవలాహకంబు లను తురంగంబులం గట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన నమోఘ మనోరథుండైన హరి తానును, బ్రాహ్మణుండును రథారోహణంబు సేసి యేకరాత్రంబున నానర్తకదేశంబులు గడచి, విదర్భదేశంబునకుఁ జనియె; నందు కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూఁతు శిశుపాలున కిత్తునని తలంచి, శోభనోద్యోగంబులు చేయించె; నప్పుడు.

భావము:- ఇలా చెప్పి, రుక్మిణి పెళ్ళి ముహుర్తం కృష్ణుడు తెలుసు కొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథి యైన దారకుడు "సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము" లనే గుఱ్ఱములు నాలుగింటిని కట్టిన రథం సిద్దం చేసాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథ మెక్కాడు. ఒక్క రాత్రిలోనే ఆనర్తకదేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ, కొడుకునకు వశవర్తుడు అయిన భీష్మకుడు కూతుర్ని చైద్యునికి ఇద్దామనుకుంటు పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

39

చ్చలు గ్రంతలు రాజమార్గంబులు;
విపణిదేశంబులు విశదములుగఁ
జేసిరి; చందనసిక్త తోయంబులు;
లయంగఁ జల్లిరి; లువడములు
మణీయ వివిధతోణములుఁ గట్టిరి;
కల గృహంబులు క్కఁ జేసి;
ర్పూర కుంకు మారుధూపములు పెట్టి;
తివలుఁ బురుషులు న్ని యెడల

వివిధవస్త్రములను వివిధమాల్యాభర
ణానులేపనముల మరి యుండి
ఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి
రుత్సవమున నగర మొప్పియుండె.

భావము:- ఆ కుండిన నగర మంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్ని శుభ్రం చేసారు. మంచి గంధం కలిపిన నీళ్ళు కళ్ళాపి జల్లారు. కలువపూల దండలు మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్ళన్ని శుభ్ర పరచారు. సుగంధ ధూపాలు పట్టారు. ప్రతిచోట రకరకాల పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళ వాద్యాలు అన్నిటిని గట్టిగా వాయిస్తున్నారు.

40

అంత నా భీష్మకుండు విహితప్రకారంబునం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవి నభిషిక్తంజేసి వస్త్రయుగళభూషితం గావించి రత్నభూషణంబు లిడంజేసి, ఋగ్యజుస్సామధర్వణ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షాకరణంబు లాచరించిరి; పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదితన్యాయంబున హోమంబు గావించె; మఱియు నా రాజు దంపతుల మేలుకొఱకుఁ దిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీదేవతల కొసంగెను; అయ్యవసరంబున.

భావము:- భీష్మకుడు పద్ధతి ప్రకారం పితృదేవతలని పూజించి, విప్రులకి భోజనాలు పెట్టించాడు. ఆశీర్వచనాలు చదివించాడు. రుక్మిణికి స్నానం చేయించి, కొత్తబట్టలు, రత్నాభరణలుతో అలంకరించారు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేసారు. పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేసాడు. దంపతులకు శుభం కోసం విప్రులకు తిలా, గో, రజత, స్వర్ణ, వస్త్రాది దానాలు చేసాడు. అప్పుడు.
మన సంప్రదాయాలను ఎంతో అలవోకగా వర్ణించిన చక్కటి వచనం యిది. ఏదైనా శుభకార్యం ఆరంభించే సమయంలో, పెద్దలను సన్మానించాలి, విప్రులను తృప్తిపరచాలి, వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి, అభ్యంగన స్నానాలు చేయాలి, శుభ్రమైన వస్త్రాలు, సకల శోభనకర అలంకారలు అలంకరించుకోవాలి, శాంతులు పూజలు దానాలు చేయాలి. ఈ సత్సంప్రదాయాలు ఎన్నో శతాబ్దాలనుండి ఆచరణలో ఉన్నాయి. సంకల్ప బల, పారిశుధ్య విలువలతో కూడిన మన సదాచారాలు కాలపరీక్షకు తట్టుకొని నిలబడ్డాయి. కనుక వాటిని వదలరాదు.

41

సంఘంబులతో రథావళులతో ద్రేభయూథంబుతోఁ
టువేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియశ్రేణితోఁ
టుసంరంభముతో విదర్భతనయం గైకొందు నంచున్ విశం
వృత్తిం జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ ర్వించి య వ్వీటికిన్.

భావము:- విదర్భ రాకుమారి రుక్మిణిని పెళ్ళాడతానంటు శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులుతో, రథాల వరుసలుతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైన గుఱ్ఱాల సైన్యంతో, బంధువులతో, చెలికాళ్ళతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి వచ్చాడు.

42

"బంధులఁ గూడి కృష్ణబలద్రులు వచ్చినఁ బాఱదోలి ని
ర్మంర వృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద" మంచు నుల్లస
త్సింధుర వీర రథ్య రథ సేనలతోఁ జనుదెంచి రా జరా
సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరక పౌండ్రకాదులున్.

భావము:- జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా “బలరామ కృష్ణులు బంధువు లందరను తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం. శిశిపాలుడికి బాలికను ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్ట బెడతాం.” అంటూ చతురంగబలాలతో వచ్చారు.

43

మఱియు నానాదేశంబుల రాజు లనేకు లేతెంచి; రందు శిశుపాలు నెదుర్కొని పూజించి భీష్మకుం డొక్కనివేశంబున నతని విడియించె; నంతఁ దద్వృత్తాంతంబు విని.

భావము:- ఇంకా వివిధదేశాలనుండి అనేకమంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేసాడు. ఈ విషయాలు తెలిసి.

44

"రి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్యహితానుసారులై
పతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం
మగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి" నంచు వేగఁ దా
రిగె హలాయుధుండు గమలాక్షుని జాడ ననేక సేనతోన్.

భావము:- బలరాముడు “అయ్యో! కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు జరాసంధుడు మున్నగువారు శిశుపాలునికి సాయంగా వెళ్ళారు; బాలికను తెచ్చేటప్పుడు యుద్ధం తప్పదు; కృష్ణుడికి సాయం అవసరం” అంటూ బలరాముడు కృష్ణుడు వెళ్ళిన దారి వెనుక సైన్యం తీసుకొని వెళ్ళాడు.

45

లోపల నేకతమున
నాలోలవిశాలనయన గు రుక్మిణి ద
న్నా లోకలోచనుఁడు హరి
యాలోకము చేసి కదియఁ ని శంకితయై.

భావము:- ఇంతట్లో చలించుతున్న పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలోతాను తన ఏకాంతమందిరంలో “సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏకారణంచేతనైనా తన మీద దృష్టిపెట్టి తనను చేరరాడేమో” నని బెంగపెట్టుకుంది. ఇంకా ఇలా అనుకోసాగింది . . .

46

"గ్నం బెల్లి; వివాహముం గదిసె, నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు; వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
గ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా త్నంబు సిద్ధించునో?
గ్నంబై చనునో? విరించికృత మెబ్భంగిన్ బ్రవర్తించునో?

భావము:- “నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే. ముహూర్తము దగ్గరకు వచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో? నా మాట విన్నాడో లేదో? బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టాడో? – (అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది.)

47

ను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో?
విని, కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
నుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్
ను రక్షింప నెఱుంగునో? యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?"

భావము:- ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో? పార్వతీదేవి నన్ను కాపాడలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?”
అంటు ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది. ఆ స్థితికి తగ్గ ఈ పద్యం చెప్పిన మన పోతన్నకి ప్రణామములు.

48
అని వితర్కించుచు.

భావము:- అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తూ ఇంకా ఇలా అనుకోసాగింది.

49

"పోఁ"ను "బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్
"రాఁ" ను;"నింకఁ బోయి హరి మ్మని చీరెడి యిష్టబంధుడున్
"లేఁ" ను;"రుక్మికిం దగవు లే, దిటఁ జైద్యున కిత్తు నంచు ను
న్నాఁ" ను;"గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే" డనున్.

భావము:- “మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకు వచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్న రుక్మికి అడ్డేం లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు” అని రకరకాలుగా మథనపడుతోంది.

50

చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికం
ప్పదు; వక్త్రతామరసగంధ సమాగత భృంగసంఘమున్
రొప్పదు; నిద్ర గైకొన; దురోజ పరస్పర సక్త హారముల్
విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్.

భావము:- రుక్మిణీ దేవి, ముకుందుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అటునుండి చూపులు తిప్పడం లేదు. తన మనసు లోని వేదనలు తల్లికి కూడ చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానికి మూగిన తుమ్మెదలని తోలటం లేదు. వక్షస్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయటం లేదు.

51

తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; కొప్పు చక్కఁగా
ముడువదు; నెచ్చెలిం గదిసి ముచ్చటకుం జన; దన్న మేమియుం
గుడువదు; నీరముం గొనదు; కూరిమిఁ గీరముఁ జేరి పద్యముం
నొడువదు; వల్లకీగుణవినోదము సేయదు; డాయ దన్యులన్.

భావము:- తనను తీసుకుపోవడానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మథనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చెలులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోటం లేదు.
రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకు వెళ్ళి రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది. అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకు వచ్చి వివాహమాడుట వరకు. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం.

52

మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ;
లకము లాడదు లజగంధి;
ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి;
పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి;
నకేళిఁ గోరదు నజాతలోచన;
హంసంబుఁ బెంపదు హంసగమన;
తలఁ బోషింపదు తికా లలిత దేహ;
తొడవులు తొడువదు తొడవు తొడవు;

తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు;
మలగృహముఁ జొరదు మలహస్త;
గారవించి తన్నుఁ రుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవుమాలి" యనుచు.

భావము:- అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో కరుణించ డానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోఙ్ఞమైన కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట. చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట.

53
మఱియును.

భావము:- ఇంతేకాకుండా.

54

లఁగున్ మెల్లని గాలికిం; బటునటన్మత్త ద్విరేఫాలికిం
లఁగుం; గోయల మ్రోఁతకై యలఁగు; నుద్యత్కీరసంభాషలం
లఁగున్; వెన్నెలఁవేడిమి న్నలఁగు; మాకందాంకురచ్ఛాయకుం
దొలఁగుం; గొమ్మ మనోభవానలశిఖా దోధూయ మానాంగియై.

భావము:- మన్మథతాపాగ్నిలో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసి పోతుంది. దోగాడే తుమ్మెదలకి తొలగిపోతుంది. కోయిల కూసినా చిరాకు పడుతుంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతుంది. వెన్నెల వేడికి వేగిపోతుంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటుంది.